'కరామా' దోపిడీ కేసులో అరెస్ట్‌లు

- December 18, 2015 , by Maagulf
'కరామా' దోపిడీ కేసులో అరెస్ట్‌లు

దుబాయ్‌ పోలీసులు ఆపరేషన్‌ 'మిరేజ్‌ డ్రీమ్‌' పేరుతో కరామా దోపిడీ కేసు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరుగురు సభ్యుల ముఠాని అరెస్ట్‌ చేశారు. ముసుగులు దరించిన కొందరు వ్యక్తులు కరామాలోని ఎక్స్‌ఛేంజ్‌ ఆఫీస్‌లో దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ దొంగలు, ఆ కార్యాలయంలోని ఇద్దరు ఇండియన్స్‌, ఓ ఫిలిప్‌కి చెందిన మహిళా ఉద్యోగులపై టియర్‌ గ్యాస్‌ని ప్రయోగించి, మిగతావారిని తుపాకీలతో బెదిరించి దోపిడీ చేశారు. పోలీసులు దుండగుల్ని ఈస్టర్న్‌ యూరోప్‌కి చెందినవారిగా గుర్తించారు. ఇంటర్‌పోల్‌ అధికారులకు సమాచారమిచ్చిన దుబాయ్‌ పోలీసులు, దుండగుల్ని చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. దొంగిలించిన కార్‌ నంబర్‌ ప్లేట్‌ని వేరే కారుకి వినియోగించి, ఆ కారులో వచ్చి దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. మిగతా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారనీ, దొంగతనం జరిగిన సొమ్ముని స్వాధీనం చేసుకున్నామనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com