'కరామా' దోపిడీ కేసులో అరెస్ట్లు
- December 18, 2015
దుబాయ్ పోలీసులు ఆపరేషన్ 'మిరేజ్ డ్రీమ్' పేరుతో కరామా దోపిడీ కేసు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరుగురు సభ్యుల ముఠాని అరెస్ట్ చేశారు. ముసుగులు దరించిన కొందరు వ్యక్తులు కరామాలోని ఎక్స్ఛేంజ్ ఆఫీస్లో దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ దొంగలు, ఆ కార్యాలయంలోని ఇద్దరు ఇండియన్స్, ఓ ఫిలిప్కి చెందిన మహిళా ఉద్యోగులపై టియర్ గ్యాస్ని ప్రయోగించి, మిగతావారిని తుపాకీలతో బెదిరించి దోపిడీ చేశారు. పోలీసులు దుండగుల్ని ఈస్టర్న్ యూరోప్కి చెందినవారిగా గుర్తించారు. ఇంటర్పోల్ అధికారులకు సమాచారమిచ్చిన దుబాయ్ పోలీసులు, దుండగుల్ని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. దొంగిలించిన కార్ నంబర్ ప్లేట్ని వేరే కారుకి వినియోగించి, ఆ కారులో వచ్చి దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. మిగతా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారనీ, దొంగతనం జరిగిన సొమ్ముని స్వాధీనం చేసుకున్నామనీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







