470,350 దిర్హామ్ల దొంగతనంలో ఇద్దరి అరెస్ట్
- December 18, 2015
షార్జా పోలీసు ఇద్దరు ఆసియన్లను అరెస్ట్ చేశారు. ఫ్రెంచ్ బిజినెస్ మేన్ నుంచి 118,000 యూరోలను దొంగతనం చేసిన కేసులో ఈ అరెస్టులు జరిగాయి. వీటి విలువ దిర్హామ్లలో 470,350 ఉంటుంది. డబ్బును ఫ్రెంచ్ బిజినెస్ మేన్ వద్ద పనిచేసే వ్యక్తి దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ళుగా ఆ ఫ్రెంచ్ వ్యాపారవేత్త వద్ద నిందితుడు పనిచేస్తున్నాడు. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా ఫ్రెంచ్ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణ జరిపి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. దొంగిలించిన డబ్బుని స్నేహితుడితో కలిసి పంచుకోవాలని పథకం వేశాడు నిందితుడు. దొంగతనం చేసిన, దానికి సహకరించిన కేసులో ఇద్దర్నీ అరెస్ట్ చేశారు పోలీసులు. డబ్బుతోపాటు కొన్ని డాక్యుమెంట్లనూ నిందితులు దొంగిలించారు. 1 నుంచి 12వ గ్రేడ్ వరకు చదువుతున్న విద్యార్థులు అస్వస్థతకు గురైనవారిలో ఉన్నారు. కప్ కేక్స్, సలాడ్స్ మరియు స్వీట్స్ని తిని విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లుగా తెలియవస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్, పరిస్థితిని సమీక్షించింది. ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరిగిందో గుర్తించేందుకు అధికారులు ఫుడ్ శాంపిల్స్ని సేకరించారు. ఆసుపత్రి వర్గాలను అడిగి సమాచారం తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







