దుబాయ్ :కారు బ్యాటరీ దొంగల అరెస్ట్
- September 24, 2018
దుబాయ్:ఆసియాకి చెందిన నలుగురు సభ్యుల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. జబెల్ అలి, కుసైస్ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో వీరు తరచూ దొంగతనాలకి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాల గురించిన ఫిర్యాదులు అందడంతో పోలీసులు, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుల్ని అరెస్ట్ చేశారు. కారు బ్యాటరీల్ని వీరు దొంగిలిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. కార్ల నుంచి బ్యాటరీలను దొంగిలించి, వాటిని సగం ధరకే విక్రయిస్తుంటామని నిందితులు విచారణలో అంగీకరించారు. వరుస దొంగతనాల నేపథ్యంలో క్రైమ్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయడంతో, నిందుతల్ని పట్టుకోగలిగినట్లు పబ్లిక్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - దుబాయ్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ రషీద్ బిన్ సారి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







