దుబాయ్ :కారు బ్యాటరీ దొంగల అరెస్ట్
- September 24, 2018
దుబాయ్:ఆసియాకి చెందిన నలుగురు సభ్యుల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. జబెల్ అలి, కుసైస్ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో వీరు తరచూ దొంగతనాలకి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాల గురించిన ఫిర్యాదులు అందడంతో పోలీసులు, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుల్ని అరెస్ట్ చేశారు. కారు బ్యాటరీల్ని వీరు దొంగిలిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. కార్ల నుంచి బ్యాటరీలను దొంగిలించి, వాటిని సగం ధరకే విక్రయిస్తుంటామని నిందితులు విచారణలో అంగీకరించారు. వరుస దొంగతనాల నేపథ్యంలో క్రైమ్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయడంతో, నిందుతల్ని పట్టుకోగలిగినట్లు పబ్లిక్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - దుబాయ్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ రషీద్ బిన్ సారి చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







