ఇయు: ఇరాన్తో వ్యాపారానికి ప్రత్యేక చెల్లింపు మార్గాలపై కసరత్తు
- September 25, 2018
బ్రసెల్స్ : ఇరాన్ అణు ఒప్పందం నుండి అమెరికా బయటకు వచ్చేసినా ఇయు దేశాలన్నీ దానికే కట్టుబడి వున్నాయని యురోపియన్ విదేశాంగ వ్యవహారాల చీఫ్ ఫెడెరికా మొగెరిని స్పష్టం చేశారు. ఇరాన్తో వ్యాపారం చేసేందుకు ప్రత్యేక చెల్లింపు మార్గాలను సృష్టించేందుకు ఇయు కసరత్తు చేస్తోంది. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జిసిపిఓఎ)పై సంతకాలు చేసిన మిగిలిన దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం అనంతరం మొగెరిని ఒక ప్రకటన చేశారు. ఒప్పందానికి అనుగుణంగా ఇరాన్ వ్యవహరిస్తోందని రష్యా, బ్రిటన్, జర్మనీ, చైనా, ఫ్రాన్స్లు ధృవీకరించాయి. చట్టబద్ధంగా ఇరాన్తో వ్యాపారం కొనసాగించేందుకు వీలుగా ప్రత్యేక చెల్లింపు మార్గాలను ఏర్పాటు చేయడంపై ఇయు చర్చలు జరుపుతోందని ఆ ప్రకటన తెలిపింది. ఆంక్షలతో ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డగించాలని అమెరికా కుట్ర పన్నుతోంది. ప్రస్తుత అత్యవసర పరిస్థితిని దృష్టిలో వుంచుకుని, స్పష్టమైన ఫలితాలు సాధించాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఆచరణాత్మకమైన ఈ ప్రతిపాదనలను సభ్య దేశాలు స్వాగతించాయని మొగెరిని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







