ముంబై చేరుకున్న వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం
- September 27, 2018
ముంబై: ఇండియాలో నెల రోజుల పర్యటన కోసం వెస్టిండీస్ టీమ్ వచ్చేసింది. ఆ టీమ్ ప్లేయర్స్కు భారత సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. హోటల్లోకి అడుగుపెట్టక ముందే డప్పులతో వాళ్లకు వెల్కమ్ చెప్పారు. ఇక లోనికి వెళ్లగానే హోటల్ సిబ్బంది వాళ్లకు బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, మెడలో హారాలు వేశారు. టీమ్ ఇండియాలో అడుగుపెట్టిన వీడియోలను ఆ టీమ్ బోర్డు తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అక్టోబర్ 4 నుంచి మొదలయ్యే తొలి టెస్ట్తో విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో ఇండియా, వెస్టిండీస్ తలపడనున్నాయి. వెస్టిండీస్ 1948 నుంచి ఇప్పటివరకు ఇండియాలో 94 టెస్టులు ఆడింది. అందులో 30 గెలవగా, 20 మ్యాచుల్లో ఓడింది. మరో 46 డ్రాగా ముగిశాయి.
వెస్టిండీస్ టెస్ట్ టీమ్:
జేసన్ హోల్డర్ (కెప్టెన్), సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, క్రెయిగ్ బ్రాత్వెయిట్, రోస్టన్ చేజ్, షేన్ డౌరిచ్, షానన్ గాబ్రియెల్, జామర్ హామిల్టన్, షిమ్రోన్ హెట్మెయర్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, కీమో పాల్, కీరన్ పావెల్, కీమార్ రోచ్, జోమెల్ వారికాన్.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







