ఇల్లీగల్ కార్ వాష్: 500 దిర్హామ్ల జరీమానా
- October 11, 2018
షార్జా: ఇల్లీగల్ కార్ వాష్కిగాను 500 దిర్హామ్ల జరీమానా విధిస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్ ప్రాంతాల్లో, స్ట్రీట్స్పైనా, రెసిడెన్షియల్ ఏరియాస్లోనూ ఇల్లీగల్ కార్ వాష్ చేయించినందుకుగాను మొత్తం 681 మంది కార్ ఓనర్లకు గత క్వార్టర్లో జరీమానాలు విధించారు. ఇల్లీగల్ కార్ వాషింగ్కి 250 నుంచి 500 దిర్హామ్ల వరకు జరీమానా విధించేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. వాచ్మెన్, ఇల్లీగల్ వర్కర్స్, ఇతరులు సాయంత్రం వేళల్లో భవనాల వద్ద, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో కార్లను వాష్ చేస్తున్నారని ఇన్స్పెక్షన్ టీమ్స్ గుర్తించాయి. ఈ నేపథ్యంలో తనిఖీల్ని మరింత ముమ్మరం చేసి, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







