గ్యాస్‌ సిలెండర్లపై రెస్టారెంట్స్‌కి హెచ్చరిక

- October 18, 2018 , by Maagulf
గ్యాస్‌ సిలెండర్లపై రెస్టారెంట్స్‌కి హెచ్చరిక

బహ్రెయిన్:గ్యాస్‌ సిలెండర్లు వినియోగించే రెస్టారెంట్లను అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించాలనీ, నిబంధనల ఉల్లంఘన జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. సల్మానియా ప్రాంతంలో గ్యాస్‌ సిలెండర్‌ ప్రమాదం కారణంగా నలుగురు చనిపోవడం, 30 మందికి పైగా గాయపడ్డంతో అధికార యంత్రాంగం రెస్టారెంట్స్‌పై నిఘా పటిష్టం చేసింది. క్యాపిటల్‌ గవర్నరేట్‌ గవర్నర్‌ షేక్‌ హిషామ్‌ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌ ఖలీపా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. అధికారులు ఎప్పటికప్పుడు రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. రెస్టారెంట్లు భద్రత, శుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com