గ్యాస్ సిలెండర్లపై రెస్టారెంట్స్కి హెచ్చరిక
- October 18, 2018
బహ్రెయిన్:గ్యాస్ సిలెండర్లు వినియోగించే రెస్టారెంట్లను అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించాలనీ, నిబంధనల ఉల్లంఘన జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. సల్మానియా ప్రాంతంలో గ్యాస్ సిలెండర్ ప్రమాదం కారణంగా నలుగురు చనిపోవడం, 30 మందికి పైగా గాయపడ్డంతో అధికార యంత్రాంగం రెస్టారెంట్స్పై నిఘా పటిష్టం చేసింది. క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీపా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. అధికారులు ఎప్పటికప్పుడు రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. రెస్టారెంట్లు భద్రత, శుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







