పోస్టల్ ఒప్పందం నుంచి వైదొలగేందుకు సన్నాహాలు చేస్తున్న ట్రంప్
- October 18, 2018అమెరికా మరో కీలక ఒప్పందానికి మంగళం పాడనుంది. కీలకమైన పోస్టల్ ఒప్పందం నుంచి వైదొలగేందుకు సన్నాహాలు చేస్తోంది. అతి తక్కువ రవాణ ఖర్చుతో చైనా నుంచి సరుకులు అమెరికాకు వస్తున్నాయని ఆరోపిస్తోంది. పేద దేశాలను ఆదుకొనేందుకు తయారు చేసిన ఈ ఒప్పందం కింద అతితక్కువ అంతర్జాతీయ ఛార్జీలతో సరుకులను రవాణా చేసే విధంగా ఐక్యరాజ్యసమితి ఏర్పాట్లు చేసింది. ఈ రాయితీల కారణంగా తమ దేశ వ్యాపారులు నష్టపోతున్నారని అమెరికా వాపోతోంది. తమ నిర్ణయంతోనైనా ఛార్జీలను సవరిస్తారని అమెరికా అధికారులు అంటున్నారు. '' మేము మెరుగైన వ్యవస్థను కోరుకుంటున్నాము. చర్చల ద్వారా మేము దానిని సాధిస్తామని నమ్ముతున్నాము. '' అని అమెరికా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
అభివృద్ధి చెందుతున్న దేశం హోదాలో చైనా 1969లో ఈ ఒప్పందంలో చేరింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దీంతో ఈ ఒప్పందంలో చైనా హోదా అభివృద్ధి చెందిన దేశంగా మారాల్సి ఉంది. కానీ తక్కువ ఛార్జిల కోసం చైనా తన హోదా మార్చుకోవడంలేదు. అమెరికా ఒత్తిడితో అయినా దీని నుంచి మార్చుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ పోస్టల్ విభాగాన్ని యూనివర్సల్ పోస్టల్ యూనియన్(యూపీయూ) పర్యవేక్షిస్తుంది. ఇదే సంస్థ ధరలను కూడా నిర్ణయిస్తుంది. ఈ సంస్థ ఐక్యరాజ్యసమితిలో ఓ భాగం. దీని కింద అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరలు, అభివృద్ధి చెందిన దేశాలకు ఎక్కువ ధరలను నిర్ణయించారు. దీనిని అడ్డం పెట్టుకొని చైనా అత్యధికంగా లబ్ధిపొందుతోంది. దీంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసి 2 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న పార్శిళ్లకు ఆయా దేశాలే పోస్టల్ ఛార్జిలు నిర్ణయించే విధంగా మార్చాలని కోరుతోంది. ఇటీవల 2 కిలోల కంటే తక్కువ బరువున్న పార్శిళ్ల సంఖ్య పెరగటంతో వివాదం మొదలైంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు