మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి కన్నుమూత
- October 18, 2018ప్రముఖ రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ఎన్డీ తివారి కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయన కొద్ది రోజులుగా దిల్లీలోని సాకేత్ ఆస్పత్రిలోచికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ ఆయన సేవలందించారు. 1925 అక్టోబర్ 18న ఉత్తరాఖండ్లోని నైనిటాల్జిల్లా బాలూటి గ్రామంలో జన్మించిన తివారీ పూర్తి పేరు నారాయణ దత్ తివారి. ప్రస్తుతం ఆయన వయస్సు 92 ఏళ్లు. ఈ రోజే తివారి 93వ పుట్టిన రోజు కావడం గమనార్హం. 2007 ఆగస్టు 19న ఏపీ గవర్నర్గా నియమితులైన తివారి 2009 డిసెంబర్ మాసంలో తన పదవికి రాజీనామా చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు