మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి కన్నుమూత

- October 18, 2018 , by Maagulf
మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి కన్నుమూత

ప్రముఖ రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేసిన ఎన్డీ తివారి కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయన కొద్ది రోజులుగా దిల్లీలోని సాకేత్‌ ఆస్పత్రిలోచికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ ఆయన సేవలందించారు. 1925 అక్టోబర్‌ 18న ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌జిల్లా బాలూటి గ్రామంలో జన్మించిన తివారీ పూర్తి పేరు నారాయణ దత్‌ తివారి. ప్రస్తుతం ఆయన వయస్సు 92 ఏళ్లు. ఈ రోజే తివారి 93వ పుట్టిన రోజు కావడం గమనార్హం. 2007 ఆగస్టు 19న ఏపీ గవర్నర్‌గా నియమితులైన తివారి 2009 డిసెంబర్‌ మాసంలో తన పదవికి రాజీనామా చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com