మహేశ్ మేనల్లుడి సినిమా 'అదేనువ్వు అదేనేను' ఆరంభం.!
- October 18, 2018
అగ్ర కథానాయకుడు మహేశ్బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. గురువారం దసరా సందర్భంగా ఆయన మొదటి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి సూపర్స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి 'అదేనువ్వు అదేనేను' అనే టైటిల్ ఖరారు చేశారు. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో గుర్తింపు పొందిన నభా నటేష్ ఈ చిత్రంలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. సుధీర్బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ సినిమాతో నభా నటేష్ నటిగా పరిచయం అయ్యారు. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఇది ఆమె రెండో చిత్రంగా రూపుదిద్దుకోనుంది.
_1539863547.jpg)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







