విశాఖలో నేటినుంచి ఫిన్టెక్ ఫెస్టివల్
- October 21, 2018
విశాఖను ఐటీ హబ్గా మార్చడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటెక్ రంగ ప్రస్తుత స్థాయిని 1.0 నుంచి 2.0 శాతానికి తీసుకెళ్లే లక్ష్యంతో.. ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
విశాఖలో ఐటీని ఇంకాస్త విస్తరించేందుకు నేటి నుంచి ఐదు రోజుల పాటు వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2018 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం.. వైజాగ్ ఫిన్టెక్ వ్యాలీ సంయుక్తంగా నిర్వహించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్తో పాటు 15 దేశాలకు చెందిన రెండు వేల మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రపంచంలో 8 చోట్ల ఏపీ ప్రభుత్వం డాలర్ చాలెంజ్ కాంపిటేషన్ని నిర్వహించింది. ఇందులో మొదటి స్థానం పొందిన సంస్థలకు లక్షా 50 వేల డాలర్లు, రెండో స్థానం సాధించిన సంస్థలకు లక్ష డాలర్లు ఇవ్వనుంది..
మొదటి రోజైన సోమవారం ఉదయం గోల్ఫ్ టోర్నమెంట్తో ఫిన్టెక్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది.. రెండో రోజు నోవాటెల్లో జరిగే కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్లు పాల్గొంటారు. అదే రోజున రోబో సోఫియాతో సీఎం పదినిమిషాల పాటు మాట్లాడనున్నారు.. మూడో రోజున కాన్ఫరెన్స్తో పాటు ఎగ్జిబిషన్, నాలుగు రోజున అవార్డుల ప్రదానోత్సవం.. ఐదో రోజున ఫెస్టివల్కు వచ్చిన ప్రతినిధులు విశాఖను సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







