సౌదీ వివరణపై అసంతృప్తి గా ఉన్న ట్రంప్
- October 21, 2018
వాషింగ్టన్ : ఇస్తాంబుల్లోని సౌదీ కాన్సులేట్లోనే జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య జరిగిందని సౌదీ అరేబియా ఇచ్చిన వివరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ హత్యకు సంబంధించి టర్కీ కోరిన వివరాలు అందజేయాలని కోరారు. యూఎస్ ఆర్థికాభివృద్ధి కోసం సౌదీతో ద్వైపాక్షిక సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్కు ఈ హత్యతో సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఇస్తాంబుల్లోని సౌదీ దౌత్యకార్యాలయంలోనే ఖషోగ్గి హత్యకు గురైనట్టు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. కాన్సులేట్లో జరిగిన ఓ ఘర్షణలో అతను ప్రాణాలు కోల్పోయినట్టు సౌదీ స్టేట్ మీడియా శనివారం వెల్లడించింది. ఈ ఘటనతో సంబంధమున్న ఆరోపణలపై సౌదీకి చెందిన అయిదుగురు ఉన్నతాధికారులను తొలిగించారు. మరో 18 మందిని అరెస్టు చేశారు. ఈనెల2న సౌదీ కాన్సులేట్ లోపలికి వెళ్లిన ఖషోగ్గి బయటకు తిరిగి రాలేదు. అదృశ్యమైన ఖషోగ్గిని సౌదీని హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అతని శవాన్ని ముక్కలు ముక్కలు చేసి సమీప అడవుల్లో పడేసినట్టు పుకార్లు వచ్చాయి. ఈ హత్యా ఘటనను సిరీయస్గా తీసుకున్న అమెరికా ప్రభుత్వం సౌదీపై ఒత్తిడి తెచ్చింది. మొదట్లో ఖషోగ్గి గురించి తమకేమీ తెలియదన్న సౌదీ.. తాజాగా అతను కౌన్సులేట్లోనే హత్యకు గురైనట్టు వెల్లడించింది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







