ఇండియా:పెట్రోల్ రేట్లు భారీగా తగ్గే అవకాశం
- November 02, 2018
భారత్లో పెట్రోల్ రేట్లు బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా ఆంక్షల పునరుద్దరణతో భారత దేశానికి ఊరట లభించి అవకాశం ఉంది. ఇరాన్ నుంచి ముడి చమురు కొనేందుకు ఇండియా, సౌత్ కొరియా, జపాన్ సహా 8 దేశాలకు అమెరికా అనుమతిచ్చింది.
వచ్చే వారం నుంచి ఇరాన్పై అమెరికా మరోసారి ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి పూర్తిగా ఆయిల్ దిగుమతులను నిలిపేయాలని అన్ని మిత్ర దేశాలను గతంలో అమెరికా ఆదేశించింది. అయితే తమకు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ 8 దేశాలు కోరాయి. ఇండియా తోపాటు జపాన్, సౌత్ కొరియా తమ చమురు దిగుమతుల కోసం ఎక్కువగా ఇరాన్పైనే ఆధారపడుతున్నాయి. తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయం ఈ దేశాలకు పెద్ద ఊరట కలిగించేదే.
ఇప్పటికీ అమెరికాతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని, రెండో రోజుల్లో తుది నిర్ణయం వెలువడుతుందని చైనాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇండియా, సౌత్ కొరియాలాగే చైనా కూడా ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ ఊరట తాత్కాలికంగా మాత్రమే ఉండొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
అమెరికా విధించిన ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ ముడి చమురు ఎగుమతులు భారీగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మధ్యలో రోజుకు 25 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తున్న ఇరాన్.. ఏడాది చివరినాటికి 15 లక్షల బ్యారెళ్లను మాత్రమే చేసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







