నిరుద్యోగులకు 3 వేలు భృతి:కేటీఆర్‌

- November 04, 2018 , by Maagulf
నిరుద్యోగులకు 3 వేలు భృతి:కేటీఆర్‌

తెలంగాణ:సంక్షేమ పథకాల అమలుకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ నిలిచిందన్నారు.. మంత్రి కేటీఆర్‌. యాదగిరి గుట్టలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేటీఆర్‌… తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించారు. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో వృద్ధాప్య పెన్షన్‌ 70 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఉండేదని… కేసీఆర్ సీఎం అయ్యాక.. ఆసరా పెన్షన్‌ వెయ్యిరూపాయలు చేశారని తెలిపారు. పేదలంతా ఆత్మగౌరవంతో బతకాలనే… ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు కేటీఆర్‌. మళ్లీ అధికారంలోకి వస్తే…. నిరుద్యోగులకు 3 వేలు భృతి ఇస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com