స్కూల్లో బిర్యానీ విక్రయం: తల్లిదండ్రుల ఆందోళన
- November 14, 2018
ఫుజైరః:స్కూల్ క్యాంటీన్లో బిర్యానీ అమ్మకాల పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి లంచ్ బాక్స్లో బిర్యానీని గమనించిన తల్లి అస్మా మొహమ్మద్ తన కుమారుడ్ని ప్రశ్నించగా, బ్రేక్ ఫాస్ట్గా తాను బిర్యానీ కొనుగోలు చేసినట్లు తన తల్లికి విద్యార్థి చెప్పాడు. ఆ విషయాన్ని ఆస్మా మొహమ్మద్ స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ క్యాంటీన్లలో నిబంధనలకు లోబడి రైస్ డిష్లకు అనుమతిస్తోంది. అయితే బిర్యానీ కారణంగా, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. తన కుమారుడికి డైజెస్టివ్ డిజాస్టర్స్ వున్నాయి గనుక, బిర్యానీ అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని బాధిత విద్యార్థి తల్లి ఆస్మా మొహమ్మద్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఫుజారియా ఎడ్యుకేషన్ సూపర్ విజన్ డిపార్ట్మెంట్ హెడ్ మిష్ అల్ అల్ ఖాదిమ్ చెప్పారు. చాలా ప్రైవేట్ స్కూళ్ళలో బిర్యానీ 10 దిర్హామ్లకే లభిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







