స్కూల్‌లో బిర్యానీ విక్రయం: తల్లిదండ్రుల ఆందోళన

- November 14, 2018 , by Maagulf
స్కూల్‌లో బిర్యానీ విక్రయం: తల్లిదండ్రుల ఆందోళన

ఫుజైరః:స్కూల్‌ క్యాంటీన్‌లో బిర్యానీ అమ్మకాల పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి లంచ్‌ బాక్స్‌లో బిర్యానీని గమనించిన తల్లి అస్మా మొహమ్మద్‌ తన కుమారుడ్ని ప్రశ్నించగా, బ్రేక్‌ ఫాస్ట్‌గా తాను బిర్యానీ కొనుగోలు చేసినట్లు తన తల్లికి విద్యార్థి చెప్పాడు. ఆ విషయాన్ని ఆస్మా మొహమ్మద్‌ స్కూల్‌ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, స్కూల్‌ క్యాంటీన్లలో నిబంధనలకు లోబడి రైస్‌ డిష్‌లకు అనుమతిస్తోంది. అయితే బిర్యానీ కారణంగా, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. తన కుమారుడికి డైజెస్టివ్‌ డిజాస్టర్స్‌ వున్నాయి గనుక, బిర్యానీ అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని బాధిత విద్యార్థి తల్లి ఆస్మా మొహమ్మద్‌ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఫుజారియా ఎడ్యుకేషన్‌ సూపర్‌ విజన్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ మిష్‌ అల్‌ అల్‌ ఖాదిమ్‌ చెప్పారు. చాలా ప్రైవేట్‌ స్కూళ్ళలో బిర్యానీ 10 దిర్హామ్‌లకే లభిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com