తెలంగాణ:బీజేపీ నాలుగో జాబితా విడుదల
- November 17, 2018
తెలంగాణలో ఎన్నికల నామినేషన్లకు గడువు ముంచుకొస్తుండటంతో కమలదళం వేగం పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా అభ్యర్ధుల జాబితా ప్రకటించారు. ఇప్పటికే 86 నియోజకవర్గాలకు కేండట్లను డిక్లేర్ చేసిన బీజేపీ అధిష్టానం తాజాగా ఏడు స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసింది. మొదటి జాబితాలో 38 స్థానాలు, రెండో లిస్టులో మరో 28 మందికి అవకాశం కల్పించింది. మూడో జాబితాలో 20 స్థానాలకు టికెట్లు ఖరారు చేశారు. తాజా జాబితాలో పేరుంటుందని ఆశించిన కొందరి నేతల ఆశలు ఆవిరయ్యాయి.
చెన్నూరు నియోజకవర్గానికి – అందుగుల శ్రీనివాసులు,జహీరాబాద్- జంగం గోపి,గజ్వేల్- ఆకులవిజయ,జూబ్లీహిల్స్- శ్రీధర్రెడ్డి, నర్సంపేట్- ఎడ్ల అశోక్రెడ్డి,సనత్నగర్- భావర్లాల్ వర్మ, పాలకుర్తి- సోమయ్య గౌడ్కు బిజెపి టికెట్ కేటాయించింది
మరోవైపు తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈనెల 25, 27, 28 తేదీల్లో బీజేపీ చీఫ్ పర్యటించనున్నారు. మూడు రోజులపాటు 12 ఎన్నికల ప్రచార సభల్లో అమిత్షా పాల్గొంటారు. అదిలాబాద్, పెద్దపల్లి, పరకాల, మహేశ్వరం, కల్వకుర్తి, మహబూబానగర్, కొత్తగూడెం, సూర్యాపేట, చౌటుప్పల్, నిజామాబాద్, కామారెడ్డి, దుబ్బాక సభలో ప్రభుత్వ వైఫల్యాల్ని షా ఎండగట్టనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







