వికలాంగుల పార్కింగ్లో వాహనాలు నిలిపితే భారీ జరీమానా
- December 22, 2015
వికలాంగులకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో ఇతరులు తమ వాహనాల్ని పార్కింగ్ చేసినట్లయితే 1000 దిర్హామ్లు ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. అలాగే 4 బ్లాక్ పాయింట్స్ కూడా వారి ఖాతాలో జమ అవుతాయి. దుబాయ్ పోలీసు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. వికలాంగులను గౌరవించాలనీ, వారికి ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు అవగాహనా కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు దుబాయ్ పోలీసులు. పది రోజులపాటు ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తారు. 'వారికి అండగా వుండండి, వారి ప్లేస్ని ఆక్యుపై చెయ్యొద్దు..' అనే స్లోగన్తో అవగాహన చేపట్టనున్నారు. 2012లో ఈ తరహా నిబంధనల ఉల్లంఘన కేసులు 9,893 నమోదు కాగా, 2013లో 8,317, 2014లో 9,405, 2015లో 10,265 కేసులు కేవలం పదకొండు నెలల్లోనే నమోదయ్యాయని అధికారులు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి నిబందనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించనున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







