వికలాంగుల పార్కింగ్లో వాహనాలు నిలిపితే భారీ జరీమానా
- December 22, 2015
వికలాంగులకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో ఇతరులు తమ వాహనాల్ని పార్కింగ్ చేసినట్లయితే 1000 దిర్హామ్లు ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. అలాగే 4 బ్లాక్ పాయింట్స్ కూడా వారి ఖాతాలో జమ అవుతాయి. దుబాయ్ పోలీసు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. వికలాంగులను గౌరవించాలనీ, వారికి ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు అవగాహనా కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు దుబాయ్ పోలీసులు. పది రోజులపాటు ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తారు. 'వారికి అండగా వుండండి, వారి ప్లేస్ని ఆక్యుపై చెయ్యొద్దు..' అనే స్లోగన్తో అవగాహన చేపట్టనున్నారు. 2012లో ఈ తరహా నిబంధనల ఉల్లంఘన కేసులు 9,893 నమోదు కాగా, 2013లో 8,317, 2014లో 9,405, 2015లో 10,265 కేసులు కేవలం పదకొండు నెలల్లోనే నమోదయ్యాయని అధికారులు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి నిబందనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించనున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









