వికలాంగుల పార్కింగ్లో వాహనాలు నిలిపితే భారీ జరీమానా
- December 22, 2015
వికలాంగులకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో ఇతరులు తమ వాహనాల్ని పార్కింగ్ చేసినట్లయితే 1000 దిర్హామ్లు ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. అలాగే 4 బ్లాక్ పాయింట్స్ కూడా వారి ఖాతాలో జమ అవుతాయి. దుబాయ్ పోలీసు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. వికలాంగులను గౌరవించాలనీ, వారికి ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు అవగాహనా కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు దుబాయ్ పోలీసులు. పది రోజులపాటు ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తారు. 'వారికి అండగా వుండండి, వారి ప్లేస్ని ఆక్యుపై చెయ్యొద్దు..' అనే స్లోగన్తో అవగాహన చేపట్టనున్నారు. 2012లో ఈ తరహా నిబంధనల ఉల్లంఘన కేసులు 9,893 నమోదు కాగా, 2013లో 8,317, 2014లో 9,405, 2015లో 10,265 కేసులు కేవలం పదకొండు నెలల్లోనే నమోదయ్యాయని అధికారులు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి నిబందనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించనున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







