తీవ్రవాదం కేసులో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష
- December 22, 2015
పేలుడు పదార్థాల్ని ఉపయోగిస్తున్నారనీ, తీవ్రవాద చర్చలకు పాల్పడుతున్నారనే అభియోగాలున్న ఐదుగురు వ్యక్తులకు హై క్రిమినల్ కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు చీఫ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వొకేట్ జనరల్ అహ్మద్ అల్ హమ్మది చెప్పారు. 2014 జూన్ 2 నాటి ఈ కేసులో, నిందితులు అల్ జనాబియా హైవేపై బుదైయా వద్ద బాంబను పేల్చారు. విచారణలో నిందితుల ప్రమేయంపై ఆధారాలు వెల్లడయ్యాయి. ముగ్గురు నిందితులు బాంబుని ఓ ఇంట్లో తయారు చేయగా, ఇంకో నిందితుడు బాంబులో అమర్చిన ఫోన్కోసం సిమ్కార్డ్ని అక్రమంగా కొనుగోలు చేశాడు. మరో నిందితుడి ఇంట్లో బాంబు తయారైంది. పోలీసుల్ని చంపేందుకు ఈ బాంబుని తయారుచేసినట్లు విచారణలో వెల్లడయ్యింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







