స్వర్ణ బార్ మాజీ కాంగ్రెస్ నేత విష్ణు దేనంట--కొల్లు రవీంద్ర

- December 22, 2015 , by Maagulf
స్వర్ణ బార్ మాజీ కాంగ్రెస్ నేత విష్ణు దేనంట--కొల్లు రవీంద్ర

నగరంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసుపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర ప్రకటన చేశారు. బెజవాడలో ఉన్న స్వర్ణబార్‌ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుదేనని మంత్రి ప్రకటించారు. కల్తీ మద్యం తాగి 39 మంది ఆసుపత్రి పాలవగా...అందులో ఐదుగురు చనిపోయారని తెలిపారు. మృతిచెందిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందచేసినట్లు మంత్రి ప్రకటించారు. స్వర్ణబార్‌లోని మొత్తం 9 మద్యం బాటిళ్ల శాంపిళ్లను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించగా ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కల్తీ మద్యం కేసు దర్యాప్తులో ఉందని త్వరలోనే మరిన్ని వివరాల్ని బయటపెడతామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com