రచయిత నుంచి డైరెక్టర్ గా మారిన రాజసింహ
- December 22, 2015
తెలుగు సినిమా లో ప్రస్తుతం డైరెక్టర్ ల హవా కంటే, హీరోల హవా కంటే రైటర్ ల హవా బాగా నడుస్తోంది. ప్రస్తుతం కలం తో కుస్తీ పట్టిన రైటర్ లు అంతా మెగా ఫోన్ తో కుస్తీ పడుతున్నారు. దర్శకులు గా మారుతున్న ప్రతీ రచయితా ఒక అద్భుత డైరెక్టర్ గా మారడం విశేషం. నిర్మాతలు కూడా రైటర్ లు డైరెక్టర్ లు గా మారినపుడు వారి కోసం ఎక్కువ బడ్జెట్ లు పెట్టడానికి వెనకాడట్లేదు. కోన వెంకట్ - గోపీమోహన్ - బి.వి.ఎస్.రవి తదితర స్టార్ రైటర్ లతో పాటు పనిచేసిన రాజసింహ మంచి టాలంట్ ఉన్నరచయిత గా పేరొందాడు. సందీప్ కిషన్ హీరోగా ఒక్క అమ్మాయి తప్ప ఇప్పుడు తన దీర్ఘకాల కల అయిన "డైరెక్టర్" అవ్వడం అనే ఛాన్స్ రావడంతో అందిపుచ్చుకునే పనిలో పడ్డాడు. సందీప్ కిషన్ హీరోగా `ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్... ఒక్క అమ్మాయి తప్ప` అనే కొత్త సినిమా ని తెరకి ఎక్కిస్తున్నాడు. ఈ రోజే రామానాయుడు స్టూడియో లో ఈ సినిమా మొదలైంది. కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని సందీప్ కిషన్ కి దగ్గరి వర్గాలు చెబుతున్నాయి. రచయిత నుంచి డైరెక్టర్ గా మారిన రాజసింహ మంచి కథని ఎంచుకున్నాడు అని స్వయంగా చాలా కరక్షన్ లు చేసుకున్న తరవాత నే ఈ సినిమా ని ప్రకటించాడుఅంటున్నారు. డైరెక్టర్ వినాయక్ ముఖ్య అతిధి గా వచ్చిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఛోటా కె.నాయుడు కెమెరామెన్గా పనిచేస్తుండగా మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. టైగర్ తో ఫార్మ్ లో ఉన్న సందీప్ కి ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









