బంగారం, వెండి ధరలు పెరిగాయి..
- December 22, 2015
మంగళవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. రూ.150 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,750కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారులు తాజాగా కొనుగోళ్లు చేపట్టడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.13శాతం పెరిగి 1,078.20 అమెరికన్ డాలర్లకు చేరింది. ఈ రోజు వెండి ధర రూ.34,000 మార్కును చేరింది. రూ.250 పెరగడంతో కేజీ వెండి ధర రూ.34,000కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయడంతో డిమాండు పెరిగిందని దీంతో ఈ లోహం ధర సైతం పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 1.7శాతం పెరిగి 14.25 అమెరికన్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









