బంగారం, వెండి ధరలు పెరిగాయి..

- December 22, 2015 , by Maagulf
బంగారం, వెండి ధరలు పెరిగాయి..

మంగళవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. రూ.150 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,750కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారులు తాజాగా కొనుగోళ్లు చేపట్టడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.13శాతం పెరిగి 1,078.20 అమెరికన్‌ డాలర్లకు చేరింది. ఈ రోజు వెండి ధర రూ.34,000 మార్కును చేరింది. రూ.250 పెరగడంతో కేజీ వెండి ధర రూ.34,000కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయడంతో డిమాండు పెరిగిందని దీంతో ఈ లోహం ధర సైతం పెరిగిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు వెండి ధర 1.7శాతం పెరిగి 14.25 అమెరికన్‌ డాలర్లకు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com