సముద్రగర్భంలో హైస్పీడ్ రైళ్లు ... చైనాలో తొలిసారి
- November 23, 2018
బీజింగ్: ఎన్నో అద్భుతాలకు వేదికైన చైనాలో తొలిసారి సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించబోతున్నారు. హైస్పీడ్ రైళ్ల కోసం ఈ టన్నెల్ను ఉపయోగించనున్నారు. తూర్పు ప్రావిన్స్ ఝెజియాంగ్లోని రెండు నగరాలను ఇది కలపనుంది. దీనివల్ల ఈ నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న గంటన్నర ప్రయాణ సమయం.. 30 నిమిషాలకు పరిమితం కానుంది. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ మొత్తం పొడవు 70.92 కిలోమీటర్లు కాగా.. అందులో 16.2 కిలోమీటర్ల మేర సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించనున్నారు. ఝెజియాంగ్ ప్రావిన్స్లోని నింగ్బో నగరాన్ని ద్వీప నగరమైన ఝౌషాన్తో కలపనుంది.
ఈ మార్గంలో హైస్పీడ్ రైలు గంటకు గరిష్ఠంగా 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కొత్త ప్రాజెక్ట్తో చైనాలో మొత్తం హైస్పీడ్ రైళ్ల మార్గం పొడవు 25 వేల కిలోమీటర్లకు చేరింది. ప్రపచంలోని మొత్తం హైస్పీడ్ రైళ్ల మార్గంలో 60 శాతం చైనాలోనే ఉండటం విశేషం. చైనాలోనూ ఈ ఝెజియాంగ్ ప్రావిన్స్లోనే తొలిసారి హైస్పీడ్ రైలు మార్గాన్ని లాంచ్ చేశారు. చైనా అభివృద్ధిలో ఈ హైస్పీడ్ రైళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. బీజింగ్-షాంఘైలాంటి రూట్లలో గంటలకు గరిష్ఠంగా 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైళ్లు ఉండటం విశేషం.
ఇండియాలోనూ ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ రైలు కోసం సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించనున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







