కర్ణాటక:ఘోర బస్సు ప్రమాదం..20 మంది దుర్మరణం
- November 24, 2018
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో బస్సు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కావేరి నది వీసీ కెనాల్లో బస్సు బోల్తా పడడంతో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మాండ్య నుంచి పాండవపుర వెళ్తున్న బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి కావేరీ నది కాలువలోకి దూసుకెళ్లినట్లుగా అధికారులు వెల్లడించారు. మృతి చెందినవారిలో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని తెలిపారు . బస్సులో సుమారుగా 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..
- దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..
- జర్మనీలో ఉద్యోగాలకు టామ్కామ్ నోటిఫికేషన్..
- డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి..
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ







