కర్ణాటక:ఘోర బస్సు ప్రమాదం..20 మంది దుర్మరణం
- November 24, 2018
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో బస్సు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కావేరి నది వీసీ కెనాల్లో బస్సు బోల్తా పడడంతో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మాండ్య నుంచి పాండవపుర వెళ్తున్న బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి కావేరీ నది కాలువలోకి దూసుకెళ్లినట్లుగా అధికారులు వెల్లడించారు. మృతి చెందినవారిలో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని తెలిపారు . బస్సులో సుమారుగా 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







