కర్ణాటక:ఘోర బస్సు ప్రమాదం..20 మంది దుర్మరణం
- November 24, 2018
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో బస్సు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కావేరి నది వీసీ కెనాల్లో బస్సు బోల్తా పడడంతో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మాండ్య నుంచి పాండవపుర వెళ్తున్న బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి కావేరీ నది కాలువలోకి దూసుకెళ్లినట్లుగా అధికారులు వెల్లడించారు. మృతి చెందినవారిలో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని తెలిపారు . బస్సులో సుమారుగా 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









