కర్ణాటక:ఘోర బస్సు ప్రమాదం..20 మంది దుర్మరణం

- November 24, 2018 , by Maagulf
కర్ణాటక:ఘోర బస్సు ప్రమాదం..20 మంది దుర్మరణం

కర్ణాటకలోని మాండ్య జిల్లాలో బస్సు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కావేరి నది వీసీ కెనాల్‌లో బస్సు  బోల్తా పడడంతో 20 మంది  ప్రయాణికులు మృతి చెందారు.  ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మాండ్య నుంచి పాండవపుర వెళ్తున్న బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి కావేరీ నది కాలువలోకి దూసుకెళ్లినట్లుగా అధికారులు వెల్లడించారు. మృతి చెందినవారిలో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని తెలిపారు . బస్సులో సుమారుగా 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com