మాకు రాజకీయంగా నష్టం జరిగింది--సోనియా గాంధీ
- November 24, 2018
తెలంగాణ:నీళ్లు, నిధులు, నియామకాల అకాంక్షలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజల జీవితాలను చూస్తుంటే భాదగా ఉందన్నారు యుపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ. మేడ్చల్ వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించి సోనియా టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల తమకు రాజకీయంగా నష్టం జరిగినా… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. . ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చామని దానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలన అంతం కాబోతున్నదన్నారు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ. తెలంగాణ ఏర్పాటులో మీ పోరాటంతో పాటు సోనియా పాత్ర కూడా ఉందన్నారు. గత నాలుగున్నారేళ్లలో తనకు తోచిందే వేదంగా.. తన కుటుంబ లబ్ధి కోసమే పాలన సాగించారని రాహుల్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పాలన అంతంకోసమే కాంగ్రెస్,టీడీపీ, సీపీఐ, టీజేఎస్ జట్టుకట్టాయని స్పష్టం చేశారు. ప్రజా కూటమిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిధ్వనిస్తున్నాయని అన్నారు రాహుల్ ..
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









