క్రికెట్ మ్యాచ్లో గొడవ.. కాల్పుల్లో 7 మంది మృతి
- November 24, 2018
ఖైబర్: పాకిస్థాన్లో ఘోరం జరిగింది. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో చెలరేగిన గొడవ చివరకు తీవ్ర హింసగా మారింది. ఆ ఘటనలో రెండు వర్గాలకు చెందిన ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులో జరిగింది. అబోటాబాద్ జిల్లాలోని ఓ పోలీసు పోస్టు వద్ద రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నారు. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న పిల్లల మధ్య ఘర్షణ మొదలైంది. అయితే ఆ గొడవ గురించి ఫిర్యాదు చేసేందుకు రెండు వర్గాలు ఓ పోలీసు పోస్టుకు చేరుకున్నాయి. అక్కడ రెండు వర్గాలకు చెందిన వారు ఆయుధాలతోనే పోలీసు స్టేషన్కు వచ్చారు. ఫిర్యాదు సమర్పిస్తున్న క్రమంలో ఆ గ్యాంగ్ల మధ్య మళ్లీ గొడవ రాజుకున్నది. దీంతో రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక వర్గానికి చెందిన ముగ్గురు, మరో వర్గానికి చెందిన నలుగురు మృతిచెందారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







