క్రికెట్ మ్యాచ్లో గొడవ.. కాల్పుల్లో 7 మంది మృతి
- November 24, 2018
ఖైబర్: పాకిస్థాన్లో ఘోరం జరిగింది. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో చెలరేగిన గొడవ చివరకు తీవ్ర హింసగా మారింది. ఆ ఘటనలో రెండు వర్గాలకు చెందిన ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులో జరిగింది. అబోటాబాద్ జిల్లాలోని ఓ పోలీసు పోస్టు వద్ద రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నారు. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న పిల్లల మధ్య ఘర్షణ మొదలైంది. అయితే ఆ గొడవ గురించి ఫిర్యాదు చేసేందుకు రెండు వర్గాలు ఓ పోలీసు పోస్టుకు చేరుకున్నాయి. అక్కడ రెండు వర్గాలకు చెందిన వారు ఆయుధాలతోనే పోలీసు స్టేషన్కు వచ్చారు. ఫిర్యాదు సమర్పిస్తున్న క్రమంలో ఆ గ్యాంగ్ల మధ్య మళ్లీ గొడవ రాజుకున్నది. దీంతో రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక వర్గానికి చెందిన ముగ్గురు, మరో వర్గానికి చెందిన నలుగురు మృతిచెందారు.
తాజా వార్తలు
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..
- ఉక్రెయిన్ ప్రధానిగా కోరెట్స్కీ...
- భారత్ పై రెండో వన్డేలో విజయం..
- ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..
- దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..







