దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..
- July 17, 2026
దుబాయ్: దుబాయ్కు సంబంధించిన తప్పుడు వార్తలు లేదా ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచురించే మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం (Government of Dubai Media Office - GDMO) హెచ్చరించింది.
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో, దుబాయ్ ఎమిరేట్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అమల్లో ఉన్న చట్టాలు, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా తప్పుడు సమాచారం ప్రచురించే మీడియా సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
మీడియా సంస్థలు, ప్రజలు వార్తలు మరియు సమాచారాన్ని అధికారిక, విశ్వసనీయ వర్గాల నుంచే పొందాలని జీడీఎంఓ సూచించింది. ఏ సమాచారాన్నైనా ప్రచురించే లేదా సోషల్ మీడియాలో పంచుకునే ముందు దాని నిజానిజాలను తప్పనిసరిగా ధృవీకరించాలని కోరింది.
అలాగే పుకార్లు, తప్పుడు వార్తలు, ధృవీకరణ లేని కథనాలను ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియా సంస్థలు, ప్రజలకు దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..
- ఉక్రెయిన్ ప్రధానిగా కోరెట్స్కీ...
- భారత్ పై రెండో వన్డేలో విజయం..
- ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..
- దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..







