దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..
- July 17, 2026
దుబాయ్: దుబాయ్కు సంబంధించిన తప్పుడు వార్తలు లేదా ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచురించే మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం (Government of Dubai Media Office - GDMO) హెచ్చరించింది.
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో, దుబాయ్ ఎమిరేట్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అమల్లో ఉన్న చట్టాలు, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా తప్పుడు సమాచారం ప్రచురించే మీడియా సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
మీడియా సంస్థలు, ప్రజలు వార్తలు మరియు సమాచారాన్ని అధికారిక, విశ్వసనీయ వర్గాల నుంచే పొందాలని జీడీఎంఓ సూచించింది. ఏ సమాచారాన్నైనా ప్రచురించే లేదా సోషల్ మీడియాలో పంచుకునే ముందు దాని నిజానిజాలను తప్పనిసరిగా ధృవీకరించాలని కోరింది.
అలాగే పుకార్లు, తప్పుడు వార్తలు, ధృవీకరణ లేని కథనాలను ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియా సంస్థలు, ప్రజలకు దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







