యూ.ఏ.ఈ:రేపటితో ముగియనున్న ఆమ్నెస్టీ
- November 29, 2018
యూ.ఏ.ఈ:నవంబర్ 30వ తేదీతో అమ్నెస్టీ ముగుస్తుందనీ, ఎలాంటి పొడిగింపులూ లేవని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఎఫ్ఎఐసి) స్పష్టం చేసింది. ఆమ్నెస్టీ ముగిసిన వెంటనే, దేశమంతటా ఎక్కడికక్కడ స్పెషల్ క్యాంపెయిన్స్ నిర్వహించి, అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరుగుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గడువు ముగిసేలోపు ఆమ్నెస్టీని వినియోగించుకోవాలని అధికారులు గుర్తు చేస్తున్నారు. 'ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' పేరుతో ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అమ్నెస్టీని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే మరో నెలరోజులపాటు ఆమ్నెస్టీని పొడిగించారు. ఆ గడువు కూడా రేపటితో ముగియనుండడంతో అధికారులు, అక్రమ నివాసితుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఆమ్నెస్టీ పీరియడ్లో కొందరు తమ స్టేటస్ని సరిదిద్దుకుంటే, మరికొందరు దేశం విడిచి వెళ్ళేందుకు మొగ్గు చూపినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







