యూ.ఏ.ఈ:రేపటితో ముగియనున్న ఆమ్నెస్టీ
- November 29, 2018యూ.ఏ.ఈ:నవంబర్ 30వ తేదీతో అమ్నెస్టీ ముగుస్తుందనీ, ఎలాంటి పొడిగింపులూ లేవని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఎఫ్ఎఐసి) స్పష్టం చేసింది. ఆమ్నెస్టీ ముగిసిన వెంటనే, దేశమంతటా ఎక్కడికక్కడ స్పెషల్ క్యాంపెయిన్స్ నిర్వహించి, అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరుగుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గడువు ముగిసేలోపు ఆమ్నెస్టీని వినియోగించుకోవాలని అధికారులు గుర్తు చేస్తున్నారు. 'ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' పేరుతో ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అమ్నెస్టీని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే మరో నెలరోజులపాటు ఆమ్నెస్టీని పొడిగించారు. ఆ గడువు కూడా రేపటితో ముగియనుండడంతో అధికారులు, అక్రమ నివాసితుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఆమ్నెస్టీ పీరియడ్లో కొందరు తమ స్టేటస్ని సరిదిద్దుకుంటే, మరికొందరు దేశం విడిచి వెళ్ళేందుకు మొగ్గు చూపినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్