పార్క్ హయత్లో చంద్రబాబు, రాహుల్ సమావేశం
- November 29, 2018
పార్క్ హయత్లో చంద్రబాబు, రాహుల్ సమావేశం అయ్యారు. అల్పాహారవిందులో తాజా రాజకీయ వ్యూహంపై చర్చించారు. ముఖ్యంగా బీజేపీయేతర కూటమి ప్రయత్నాలపై ఫోకస్ పెట్టారు. తెలంగాణలో మహాకూటమిని గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా మాట్లాడారు. ఇప్పటికే రాహుల్తో కలిసి ఖమ్మం సభలోనూ, సనత్నగర్, నాంపల్లిలోనూ చేసిన రోడ్షోలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. మేనిఫెస్టో హామీలను జనంలోకి తీసుకెళ్లే అంశంపై చర్చించారు.
అటు, రాహుల్తో భేటీకి ముందు మీడియా యాజమాన్యాలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి కేసీఆర్ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. తనకు తెలంగాణలో తిరిగే హక్కు లేదని KCR ఎలా అంటారని ప్రశ్నించారు. హైదరాబాద్ రావడానికి మోడీ, రాహుల్కు ఉన్న హక్కు తనకు ఎందుకు ఉండదని, కేసీఆర్ కావాలనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
తెలుగువారి హక్కుల కోసం టీడీపీ ఎప్పుడూ పోరాడుతుందని, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. మోడీ కనుసన్నల్లో కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రాజెక్టులకు నాంది పలికిందే తాము అయినప్పుడు వాటిని ఎందుకు అడ్డుకుంటాని, ఈ అంశాన్ని అంతా గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహాకూటమి అధికారంలోకి వచ్చాక చర్చల ద్వారా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు లేకుండా చూసుకుంటామని అన్నారు. పోటీ చేసే సీట్లు ముఖ్యం కాదని, అన్ని చోట్లా గెలవడమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. తాము 13 చోట్లా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







