షిరిడీ సాయిబాబా ట్రస్ట్ నుంచి భారీ రుణం తీసుకున్న ప్రభుత్వం
- December 02, 2018
ముంబయి: మహారాష్ట్ర అనగానే మనందరి మనస్సులో మెదిలేది షిరిడి. అహ్మద్నగర్ జిల్లాలో షిరిడి దేవాలయం ఉంది. ఇప్పుడు కష్టాల్లో ఉన్న ఆ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు సాయిబాబా సహాయం అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం షిరిడి సాయిబాబా దేవాలయం నుంచి భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. అహ్మద్నగర్ జిల్లాలో తాగునీటి సమస్యను తీర్చేందుకు ఉద్దేశించిన నిల్వాండే ఇరిగేషన్ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నగదు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ ఆఫ్ షిరిడి నుంచి ఎలాంటి వడ్డీలేకుండా రూ.500 కోట్ల రుణాన్ని తీసుకోవాలని మహా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం దేవస్థానం ఛైర్పర్సన్, బీజేపీ నేత సురేశ్ హవారేను మహా సర్కార్ సంప్రదించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోరిన నిధులను ఇచ్చేందుకు ఆయన ఒప్పుకున్నారు. వడ్డే లేకుండా ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వ సంస్థలకు గతంలో ఎప్పుకూ కూడా ఇవ్వలేదు. మరోవైపు రుణాన్ని ఎప్పుడు తిరిగి చెల్లించేందుకు ఎలాంటి గడువు కూడా టెంపుల్ బోర్డు విధించలేదు.
రుణం ప్రతిపాదనకు ఫిబ్రవరి 1న ఆమోదం లభించగా.. రెండు విడతల్లో నిధులు విడుదల చేసేందుకు శనివారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ విశేషాలు.. దేవాలయం పేరిట ఇప్పటి వరకు రూ.2,100కోట్లు డిపాజిట్లు ఉన్నాయి.
ప్రతిరోజు రూ.2కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఏడాదికి సుమారు రూ.700కోట్లకుపైనే ఇన్కమ్ వస్తోంది. ప్రతిరోజు 70వేలకు పైగా భక్తులు వస్తుండగా.. పండుగల సమయంలో 3.5లక్షల మంది సాయి భక్తులు వస్తారని అంచనా.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









