ఇండియా:బ్యాంకు ఉద్యోగుల సమ్మె..

- December 03, 2018 , by Maagulf
ఇండియా:బ్యాంకు ఉద్యోగుల సమ్మె..

మూడు ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 26న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెకట్రటరీ సీహెచ్ వెంకటాచలం ప్రకటించారు.ఈ సమ్మెలో అన్ని యూనియన్లు పాల్గొంటాయని తెలిపారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ విలీనాన్ని నిరసిస్తూ ఈ నెల 26న దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెడీఎఫ్‌సీ బ్యాంక్‌లు అతి పెద్ద బ్యాంకులుగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు బరోడా, దేనా, విజయా బ్యాంకులు విలీనమైతే దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంక్ అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com