సింగపూర్ నుంచి గన్నవరం చేరుకున్న తొలి విమానం

- December 04, 2018 , by Maagulf
సింగపూర్ నుంచి గన్నవరం చేరుకున్న తొలి  విమానం

విజయవాడ: సింగపూర్ నుంచి తొలి విమానం గన్నవరం విమనాశ్రయానికి మంగళవారం చేరుకుంది. ఇండిగో సంస్థకు చెందిన విమానం 150 మంది ప్రయాణికులతో గన్నవరం రాగానే విమానాశ్రయ అధికారులు స్వాగతం పలికారు. సిబ్బంది వారికి పుష్పగుచ్ఛాలిచ్చి అభినందించారు. సింగపూర్ నుంచి వస్తున్న ప్రయాణికులందరికీ సీఆర్డీఏ తరఫున అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను అందజేశారు. సింగపూర్‌కు విమాన సర్వీసు ప్రారంభం కావడం వల్ల తమ ప్రయాణానికి అనుకూలంగా ఉందని ప్రయాణికులు తెలిపారు. గతంలో చెన్నై, బెంగుళూరు లేదా హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడా ప్రయాస తప్పిందని సంతోషం వ్యక్తంచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com