చమురు ఎగుమతులను అడ్డుకోలేరు:హసన్ రౌహని
- December 04, 2018
జెనీవా : ఇరాన్ తన చమురును ఎగుమతి చేసుకోనివ్వకుండా అమెరికా ఆపలేదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని మంగళవారం స్పష్టం చేశారు. గల్ఫ్ గుండా వెళ్ళే ఇరాన్ చమురు ఎగుమతులను నిరోధిస్తే ఈ మార్గం గుండా వెళ్ళే అన్ని చమురు ఎగుమతులను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇరాన్ చమురు ఎగుమతులను జీరోకి తగ్గించాలనే లక్ష్యంతో ఆంక్షలు విధించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని, ప్రాంతీయ ప్రాబల్యాన్ని అణచివేసే ఉద్దేశ్యంతోనే ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. 'మా చమురును మేం ఎగుమతి చేసుకుంటున్నామనేది అమెరికా తెలుసుకోవాలి. మా ఎగుమతులను వారు అడ్డుకోలేరు.'' అని రౌహని టెలివిజన్లో ప్రసంగిస్తూ స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు వారు మా ఎగుమతులను అడ్డుకోవాలనుకుంటే ఇక ఆ రోజు నుండి పర్షియన్ గల్ఫ్ గుండా అసలు చమరే ఎగుమతి కాదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంతో, అమెరికాతో ఇరాన్ ఆర్థిక సంబంధాలను దెబ్బ తీయడంలో అమెరికా విజయం సాధించలేదని ఆయన తెలిపారు. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇరాన్ ప్రభుత్వం వారి (అమెరికా) లక్ష్యమైనపుడు సమాజంలో వృద్ధులు, బలహీనులపై ఒత్తిడి తీసుకురారాదని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇషాక్ జహంగిరి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







