చమురు ఎగుమతులను అడ్డుకోలేరు:హసన్ రౌహని
- December 04, 2018
జెనీవా : ఇరాన్ తన చమురును ఎగుమతి చేసుకోనివ్వకుండా అమెరికా ఆపలేదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని మంగళవారం స్పష్టం చేశారు. గల్ఫ్ గుండా వెళ్ళే ఇరాన్ చమురు ఎగుమతులను నిరోధిస్తే ఈ మార్గం గుండా వెళ్ళే అన్ని చమురు ఎగుమతులను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇరాన్ చమురు ఎగుమతులను జీరోకి తగ్గించాలనే లక్ష్యంతో ఆంక్షలు విధించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని, ప్రాంతీయ ప్రాబల్యాన్ని అణచివేసే ఉద్దేశ్యంతోనే ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. 'మా చమురును మేం ఎగుమతి చేసుకుంటున్నామనేది అమెరికా తెలుసుకోవాలి. మా ఎగుమతులను వారు అడ్డుకోలేరు.'' అని రౌహని టెలివిజన్లో ప్రసంగిస్తూ స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు వారు మా ఎగుమతులను అడ్డుకోవాలనుకుంటే ఇక ఆ రోజు నుండి పర్షియన్ గల్ఫ్ గుండా అసలు చమరే ఎగుమతి కాదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంతో, అమెరికాతో ఇరాన్ ఆర్థిక సంబంధాలను దెబ్బ తీయడంలో అమెరికా విజయం సాధించలేదని ఆయన తెలిపారు. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇరాన్ ప్రభుత్వం వారి (అమెరికా) లక్ష్యమైనపుడు సమాజంలో వృద్ధులు, బలహీనులపై ఒత్తిడి తీసుకురారాదని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇషాక్ జహంగిరి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









