48 గంటలు మందు బంద్
- December 05, 2018
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఆఖరు అంకానికి చేరింది. మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియబోతుండడంతో.. అభ్యర్థులు నియోజకవర్గంలో ఆఘమేఘాలమీద పర్యటనలు చేస్తూ ఓట్లు అభ్యర్తిస్తున్నారు. ఈ నెల 7న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. నియమావళి ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించాలి. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనున్నందున ఆయా చోట్ల ఇవాళ సాయంత్రం 4 గంటలకే ప్రచారానికి ఫుల్స్టాప్ పడుతుంది. మిగతా 106 చోట్ల 5 గంటల తర్వాత మైక్లు, లౌడ్ స్పీకర్లు బంద్ అవుతాయి.
అలాగే.. ఈ 48 గంటలు బల్క్ SMSలపై కూడా నిషేధం ఉంటుంది. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు 12 రకాల ప్రత్యామ్నాయ కార్డులను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పోస్టాఫీస్ పాసు పుస్తకం, పాన్ కార్డు లాంటివి చూపించి ఓటు వెయ్యొచ్చు. అటు, ప్రచార గడువు ముగిసినప్పటి నుంచి మద్యం అమ్మకాలు కూడా బంద్ అవుతాయి. 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసాక.. మళ్లీ వైన్ షాపులు తెరుచుకుంటాయి. అప్పటి వరకూ డ్రై డే ఉంటుంది. అలాగే ఎవరైనా మద్యం సేవించి ఓటు వేయడానికి వస్తే.. ఈసారి కేసులు కూడా నమోదు చేయబోతున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







