పారిస్లో ఆందోళనలు, ఈఫిల్ టవర్ మూసివేత.!
- December 07, 2018
పారిస్: ఫ్రాన్స్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో శనివారం పారిస్లోని ఈఫిల్ టవర్ను మూసివేయనున్నారు. ఇంధనంపై పన్నులు, పెరిగిపోతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ గళమెత్తిన విషయం తెలిసిందే. రెండు వారాలుగా కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు చేతుల్లో రాడ్లు, గొడ్డళ్లు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. కనిపించిన వాహనాలు, ఇళ్లను తగులబెట్టారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దేశవ్యాప్తంగా 89 వేల పోలీసు ఆఫీసర్లు డ్యూటీలో ఉన్నారు. ఆర్మీ వాహనాలను కూడా మోహరించారు. పారిస్లో ఉన్న షాపులు, రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. యెల్లో వెస్ట్ పేరుతో ఫ్రాన్స్లో నవంబర్ 17 నుంచి ఉద్యమం సాగుతున్నది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







