తెలంగాణ:రాష్ట్ర వ్యాప్తంగా టోల్ రుసుం ఎత్తివేత
- December 07, 2018తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం వరకు టోల్ రుసుం ఎత్తివేశారు. టోల్ రుసుం ఎత్తివేయాలని అన్ని టోల్ప్లాజాలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవో రజత్కుమార్ సీఎస్ను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి టోల్ రుసుం ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లి ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సొంత గ్రామాలకు బయల్దేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. టోల్ప్లాజా వద్ద ఓటర్ల ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల కమిషన్ ఈరోజు సాయంత్రం టోల్ప్లాజా రుసుం ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్