తెలంగాణ:రాష్ట్ర వ్యాప్తంగా టోల్ రుసుం ఎత్తివేత
- December 07, 2018
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం వరకు టోల్ రుసుం ఎత్తివేశారు. టోల్ రుసుం ఎత్తివేయాలని అన్ని టోల్ప్లాజాలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవో రజత్కుమార్ సీఎస్ను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి టోల్ రుసుం ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లి ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సొంత గ్రామాలకు బయల్దేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. టోల్ప్లాజా వద్ద ఓటర్ల ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల కమిషన్ ఈరోజు సాయంత్రం టోల్ప్లాజా రుసుం ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









