తెలంగాణ:రాష్ట్ర వ్యాప్తంగా టోల్ రుసుం ఎత్తివేత
- December 07, 2018
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం వరకు టోల్ రుసుం ఎత్తివేశారు. టోల్ రుసుం ఎత్తివేయాలని అన్ని టోల్ప్లాజాలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవో రజత్కుమార్ సీఎస్ను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి టోల్ రుసుం ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లి ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సొంత గ్రామాలకు బయల్దేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. టోల్ప్లాజా వద్ద ఓటర్ల ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల కమిషన్ ఈరోజు సాయంత్రం టోల్ప్లాజా రుసుం ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







