తెలంగాణ:రాష్ట్ర వ్యాప్తంగా టోల్‌ రుసుం ఎత్తివేత

- December 07, 2018 , by Maagulf
తెలంగాణ:రాష్ట్ర వ్యాప్తంగా టోల్‌ రుసుం ఎత్తివేత

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం వరకు టోల్‌ రుసుం ఎత్తివేశారు. టోల్‌ రుసుం ఎత్తివేయాలని అన్ని టోల్‌ప్లాజాలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవో రజత్‌కుమార్‌ సీఎస్‌ను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి టోల్‌ రుసుం ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లి ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సొంత గ్రామాలకు బయల్దేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. టోల్‌ప్లాజా వద్ద ఓటర్ల ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల కమిషన్‌ ఈరోజు సాయంత్రం టోల్‌ప్లాజా రుసుం ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com