బ్రెజిల్ బ్యాంక్ రాబరీ: 14 మంది కాల్చివేత...
- December 08, 2018
బ్రెజిల్:బ్రెజిల్ దేశం నార్త్ ఈస్ట్ ప్రాంతం సీరా రాష్ట్రంలోని మిలాగ్రిస్ పట్టణం. మెయిన్ రోడ్డులో వరసగా రెండు బ్యాంకులు ఉన్నాయి. ఏటీఎంలు కూడా ఉన్నాయి. లావాదేవీలు భారీగా జరుగుతుంటాయి. రద్దీగా ఉంటుంది. ఈ రెండు బ్యాంకులు పక్కపక్కనే ఉండటం, భారీగా డబ్బు ఉంటుందని భావించిన ఓ గ్యాంగ్ దోపిడీకి స్కెచ్ వేసింది. అనుకున్నదే ప్లాన్ అమలు చేసింది గ్యాంగ్. మొత్తం ఐదుగురు. ముసుగులు వేసుకున్నారు.. గన్స్, ఇతర కట్టర్లు రెడీ చేసుకుని పెద్ద వ్యాన్ లో బ్యాంక్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందర్నీ నిర్బంధించారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు.
ఓపెన్ ఫైరింగ్ :
బ్యాంకు దోపిడీదారులపై పోలీసులు ఓపెన్ ఫైరింగ్ చేశారు. విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. లోపల ఎంత మంది ఉన్నారు.. ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని పట్టించుకోకుండా తుపాకుల మోత మోగించటంతో 14 మంది చనిపోయారు. వీరిలో ఐదుగురు దోపిడీదారులు.
మిగిలిన 9 మంది బ్యాంకుకి వచ్చిన కస్టమర్లు, సిబ్బంది ఉన్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉండటం విషాదం. కాల్పుల కాల్పులపై బ్రెజిల్ లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముందూ వెనకా చూడకుండా కాల్పులకు దిగటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.బ్రెజిల్ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







