బ్రెజిల్ బ్యాంక్ రాబరీ: 14 మంది కాల్చివేత...
- December 08, 2018బ్రెజిల్:బ్రెజిల్ దేశం నార్త్ ఈస్ట్ ప్రాంతం సీరా రాష్ట్రంలోని మిలాగ్రిస్ పట్టణం. మెయిన్ రోడ్డులో వరసగా రెండు బ్యాంకులు ఉన్నాయి. ఏటీఎంలు కూడా ఉన్నాయి. లావాదేవీలు భారీగా జరుగుతుంటాయి. రద్దీగా ఉంటుంది. ఈ రెండు బ్యాంకులు పక్కపక్కనే ఉండటం, భారీగా డబ్బు ఉంటుందని భావించిన ఓ గ్యాంగ్ దోపిడీకి స్కెచ్ వేసింది. అనుకున్నదే ప్లాన్ అమలు చేసింది గ్యాంగ్. మొత్తం ఐదుగురు. ముసుగులు వేసుకున్నారు.. గన్స్, ఇతర కట్టర్లు రెడీ చేసుకుని పెద్ద వ్యాన్ లో బ్యాంక్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందర్నీ నిర్బంధించారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు.
ఓపెన్ ఫైరింగ్ :
బ్యాంకు దోపిడీదారులపై పోలీసులు ఓపెన్ ఫైరింగ్ చేశారు. విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. లోపల ఎంత మంది ఉన్నారు.. ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని పట్టించుకోకుండా తుపాకుల మోత మోగించటంతో 14 మంది చనిపోయారు. వీరిలో ఐదుగురు దోపిడీదారులు.
మిగిలిన 9 మంది బ్యాంకుకి వచ్చిన కస్టమర్లు, సిబ్బంది ఉన్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉండటం విషాదం. కాల్పుల కాల్పులపై బ్రెజిల్ లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముందూ వెనకా చూడకుండా కాల్పులకు దిగటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.బ్రెజిల్ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి
- పతంజలికి మరో షాక్.. 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్
- హైదరాబాద్లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్
- బాలాకోట్ దాడుల విషయం పాక్ కే ముందు చెప్పాం..చాటుమాటు వ్యవహారాలు నేను చేయను: మోడీ
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు