బీజేపీపై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
- December 08, 2018
బీజేపీ ప్రభుత్వం ముమ్మాటికీ ముస్లిం వ్యతిరేకి, పాకిస్తాన్ వ్యతిరేకి అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, శాంతి చర్చలకు ఆహ్వానించినా స్పందించడం లేదని అమెరికాకు చెందిన ఓ వార్త చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
స్కార్ సమావేశం నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. సార్క్ చార్టర్ సూత్రాలకు అనుగుణంగా నడుచుకుంటుందని 34వ సార్క్ చార్టర్డే వేడుకలో పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెహ్రిమా జాన్జువా తెలిపారు.
అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ముగ్గురు భారతీయులపై కేసులు నమోదయ్యాయి. సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు శాఖ ఖాతదారులకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించి అక్రమంగా బయటికి అందించినట్లు పోలీసులు గుర్తించారు. గన్నమనేని రాజేశ్వర్(36), భారత్లో ఉంటున్న తన భార్య గండ్ర దీప్తి(33), తండ్రి గన్నమనేని లింగారావు(68)లకు కీలక, రహస్య సమాచారాన్ని అందజేసినట్లు సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజి కమిషన్(ఎస్ఈసీ) ఓ ప్రకటనలో తెలిపింది.
బ్రిటన్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ కోటీశ్వరులకు శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం జారీచేస్తున్న గోల్డెన్ వీసా (టైర్ 1 ఇన్వెస్టర్ వీసా)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







