చెక్ బుక్స్: యూఏఈ బ్యాంకుల కొత్త రూల్
- December 10, 2018
యూఏఈ సెంట్రల్ బ్యాంక్, చెక్ బుక్స్కి సంబంధించి కొత్త రూల్ని పాస్ చేసింది. యూఏఈలోని అన్ని బ్యాంకులకు ఈ మేరకు సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. బ్యాంకులు, వినియోగదారులకు చెక్బుక్స్ జారీ చేసే ముందు, అల్ ఎతిహాద్ క్రెడిట్ బ్యూరో (ఎఇసిబి) ద్వారా తమ వినియోగదారుల క్రెడిట్ వర్తీనెస్ని చెక్ చేసుకోవాల్సి వుంటుంది. అలాగే కొత్త వినియోగదారులకు అత్యధికంగా 10 చెక్స్ని మాత్రమే ఇవ్వాల్సి వుంటుంది. ఆరు నెలల తర్వాత, చెక్స్ రిటర్న్ లేకపోతే తదుపరి చెక్బుక్స్ జారీ చేయవచ్చు. బ్యాంకులు, వినియోగదారులకు తగిన మొత్తం లేనప్పుడు, ఎఇసిబి నెగెటివ్ ఎఫెక్ట్ ఇస్తుందనే విషయాన్ని తెలియజేయాల్సి వుంటుంది. చెక్లను తక్కువగా వినియోగించి, ఇతరత్రా మార్గాల్ని లావాదేవీలకోసం వినియోగించాల్సిందిగా బ్యాంకులు, వినియోగదారులకు తెలియజేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!







