చెక్ బుక్స్: యూఏఈ బ్యాంకుల కొత్త రూల్
- December 10, 2018
యూఏఈ సెంట్రల్ బ్యాంక్, చెక్ బుక్స్కి సంబంధించి కొత్త రూల్ని పాస్ చేసింది. యూఏఈలోని అన్ని బ్యాంకులకు ఈ మేరకు సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. బ్యాంకులు, వినియోగదారులకు చెక్బుక్స్ జారీ చేసే ముందు, అల్ ఎతిహాద్ క్రెడిట్ బ్యూరో (ఎఇసిబి) ద్వారా తమ వినియోగదారుల క్రెడిట్ వర్తీనెస్ని చెక్ చేసుకోవాల్సి వుంటుంది. అలాగే కొత్త వినియోగదారులకు అత్యధికంగా 10 చెక్స్ని మాత్రమే ఇవ్వాల్సి వుంటుంది. ఆరు నెలల తర్వాత, చెక్స్ రిటర్న్ లేకపోతే తదుపరి చెక్బుక్స్ జారీ చేయవచ్చు. బ్యాంకులు, వినియోగదారులకు తగిన మొత్తం లేనప్పుడు, ఎఇసిబి నెగెటివ్ ఎఫెక్ట్ ఇస్తుందనే విషయాన్ని తెలియజేయాల్సి వుంటుంది. చెక్లను తక్కువగా వినియోగించి, ఇతరత్రా మార్గాల్ని లావాదేవీలకోసం వినియోగించాల్సిందిగా బ్యాంకులు, వినియోగదారులకు తెలియజేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







