శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాల భాగోతం
- December 14, 2018శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాల భాగోతం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో పలువురు ఎయిర్పోర్ట్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఓ ఎయిర్లైన్స్కు చెందిన పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలోనూ విచారణ చేపట్టారు.
సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్టుతో పాటు వీసా తప్పనిసరి. ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణికుల పాస్పోర్టులు, వీసాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తారు. అయితే.. ఓ ఎయిర్లైన్స్కు చెందిన కొందరు సిబ్బంది నకిలీ వీసాలతో చెక్కేసేవారితో కుమ్మక్కై ఈ దందాకు తెరలేపారు. ఎయిర్లైన్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు