నేపాల్‌: ఘోర రోడ్డు ప్రమాదం...20 మంది మృతి

- December 15, 2018 , by Maagulf
నేపాల్‌: ఘోర రోడ్డు ప్రమాదం...20 మంది మృతి

ఖాట్మండ్‌ : నేపాల్‌లోని నువాకోట్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక మినీ ట్రక్కు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 20మంది మృతిచెందినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నువాకోట్‌లోని కిమ్‌తాంగ్‌ నుంచి సిసిఫు వెళ్తున్న ఓ ట్రక్కు సముంద్రతర్‌ వద్ద అదుపుతప్పి కొండపై నుంచి నదిలో పడింది. ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతిచెందారని, వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందినట్లు తెలిపారు. ఘటన సమయంలో ట్రక్కులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు, భద్రతాసిబ్బంది, నేపాల్‌ ఆర్మీ ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా తమ బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. బస్సు పరిమితి కంటే ఎక్కువ మంది ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com