నేపాల్: ఘోర రోడ్డు ప్రమాదం...20 మంది మృతి
- December 15, 2018
ఖాట్మండ్ : నేపాల్లోని నువాకోట్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక మినీ ట్రక్కు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 20మంది మృతిచెందినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నువాకోట్లోని కిమ్తాంగ్ నుంచి సిసిఫు వెళ్తున్న ఓ ట్రక్కు సముంద్రతర్ వద్ద అదుపుతప్పి కొండపై నుంచి నదిలో పడింది. ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతిచెందారని, వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందినట్లు తెలిపారు. ఘటన సమయంలో ట్రక్కులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు, భద్రతాసిబ్బంది, నేపాల్ ఆర్మీ ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా తమ బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. బస్సు పరిమితి కంటే ఎక్కువ మంది ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









