‘యాత్ర’ రిలీజ్ వాయిదా.. ఎందుకంటే..
- December 15, 2018
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం అయిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైయస్ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదట అనుకుంటున్నట్టు పండక్కి రావడం లేదు. 2019 ఫిబ్రవరి 8న విడుదల అవుతుందని నిర్మాతలు వెల్లడించారు. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి కాకపోవటంతో ఫిబ్రవరికి వాయిదా వేసినట్టు చెబుతున్నారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ‘యాత్ర’ను నిర్మిస్తున్నారు. ఆనందో బ్రహ్మా చిత్రానికి దర్శకత్వం వహించిన మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









