3వేల జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి..

- December 19, 2018 , by Maagulf
3వేల జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి..

జనవరిలో జేఎల్‌ఎం, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్ ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జి. రఘుమారెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్‌లోని విద్యుత్ భవన్‌లో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం నుంచి విధి విధానాలు అందిన వెంటనే కింది స్థాయి సిబ్బందిని భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. 2500 జేఎల్‌ఎం, 500 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాలు డీడీయూజీజేవై, ఐపీడీఎస్ లక్ష్యాలను పూర్తి చేశామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను మూడు నెలల్లో క్లియర్ చేస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com