సొంతగడ్డపై సింధు ఆటను చూసేందుకు అభిమానుల ఆసక్తి

- December 25, 2018 , by Maagulf
సొంతగడ్డపై సింధు ఆటను చూసేందుకు అభిమానుల ఆసక్తి

హైదరాబాద్:ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ హైదరాబాద్ లెగ్ ఇవాళ ప్రారంభం కాబోతోంది. నాలుగురోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు గచ్చిబౌలీ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న అన్ని జట్ల క్రీడాకారులు ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నారు. ఇవాళ జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ , చెన్నై స్మాషర్స్ తలపడనున్నాయి. తొలిసారిగా హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి ఆడుతోన్న సింధు టోర్నీ ఆరంభ పోరులో స్టార్ ప్లేయర్ కరోలినా మారిన్‌పై గెలిచి శుభారంభం చేసింది. సొంతగడ్డపై సింధు ఆటను చూసేందుకు అటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com