సింగపూర్ లో మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం

- December 26, 2018 , by Maagulf
సింగపూర్ లో మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం

సింగపూర్:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్‌ చేరుకున్న లోకేష్‌కు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఎన్‌ఆర్‌ఐలు, ఏపీఎన్నార్టీ సభ్యులు స్వాగతం పలికారు. సింగపూర్‌ ప్రభుత్వం అందించే అరుదైన గౌరవాన్ని మంత్రి లోకేష్‌ స్వీకరించనున్నారు. సింగపూర్‌ ప్రభుత్వం లోకేష్‌కు ఎన్‌ఆర్‌నాథన్‌ ఫెలోషిప్‌ ప్రకటించింది. సింగపూర్‌ ఆరవ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌నాథన్‌ సేవలను స్మరిస్తూ ఈ ఫెలోషిప్‌ ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌లో పలువురు మంత్రులతో లోకేష్‌ సమావేశం కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com