కేరళలో ఉద్రిక్త పరిస్థితులు
- January 03, 2019
శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి రుతుస్రావ వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఘటనను నిరసిస్తూ కేరళలో బంద్ నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ కేరళలో అయ్యప్ప భక్తులు ఆందోళనలు చేస్తున్నారు. నిరసనకారులు రాళ్లు రువ్వుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కాలికట్, కన్నూర్, తిరువనంతపురం, పాలక్కాడ్ జిల్లాల్లో నిరసనకారులు బస్సులపై, ప్రభుత్వ కార్యాలయాలపై రాళ్లు రువ్వుతున్నారు. నిరసనకారుల దాడిలో 60 బస్సులు ధ్వంసమయ్యాయి. దీనితో కెఎస్ ఆర్టిసి బస్సు సర్వీసులను నిలిపివేసింది. మలప్పురంలో సిపిఎం కార్యాలయాలపై నిరసనకారులు దాడులు చేస్తున్నారు. పోలీసులు 8 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







