హీరా గ్రూప్ స్కాం అప్డేట్
- January 03, 2019
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వేల కోట్ల డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసిన హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్ను ఇవాళ ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను మరి కొద్ది సేపట్లో చిత్తూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు.
అనేక స్కీముల పేరుతో వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడటమే కాకుండా.. నౌహీరా సారథ్యంలోని హీరా గ్రూప్నకు ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. హీరా గ్రూప్లో ఉగ్రవాదులకు సంబంధించిన డిపాజిట్లు ఉన్నాయని.. ఈ విషయంపై మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు అంటున్నారు.
దేశవ్యాప్తంగా నౌహీరా మోసాలు ఉండటమే కాకుండా పలు బ్యాంకు ఖాతాలను కూడా నిర్వహించారని.. విదేశాల్లో కూడా ఈమెకు బ్యాంకు ఖాతాలు ఉండే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారాన్ని ఏపీ సీఐడీ కోరింది. 8 విదేశీ బ్యాంకుల్లో వందల కోట్ల రూపాయల లావాదేవీలను హీరా గ్రూప్ నిర్వహించినట్లు తేలింది. ఇప్పటి వరకు సీఐడీ దర్యాప్తులో హీరా గ్రూప్ స్కాం విలువ 8 వేల కోట్ల రూపాయలు ఉంటుందనే అంచనాకు వచ్చారు.
మరోవైపు హీరా గ్రూప్ ఫెమా నిబంధనలు కూడా ఉల్లంఘించి నిధులను అక్రమంగా ఉపయోగించినట్లు సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయల స్కాం వెనుక రాజకీయ నాయకులు హస్తం కూడా ఉండే అవకాశం లేకపోలేదని.. అందుకే మరింత లోతైన దర్యాప్తు కోసం నౌహీరా కస్టడీని పోలీసులు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







