క్రిస్మస్ పర్వదినాన నైజీరియాలో విషాదం

- December 24, 2015 , by Maagulf
క్రిస్మస్ పర్వదినాన నైజీరియాలో విషాదం

క్రిస్మస్ పర్వదినాన నైజీరియాలో విషాదం చోటు చేసుకుంది. ఆగ్నేయ నైజీరియాలోని న్యూవీ పారిశ్రామిక ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్ ట్రక్ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మరణించారు. క్రిస్మస్ పండగ నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ ఎక్కించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు క్యూలో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు సంభవించిన వెంటనే అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆగ్నేయ నైజీరియాలో అధిక సంఖ్యలో క్రిస్టియన్లు నివసిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com