గల్ఫ్ మరణాల గణాంకాలు...
- January 06, 2019
ఢిల్లీ:గల్ఫ్ దేశాల్లో భారత కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి రక్షణ కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. 2014 నుంచి 2018 మధ్య గల్ఫ్ దేశాలైన బహ్రైన్, కువైట్, ఒమన్, కతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లలో 28,523 మంది భారత కార్మికులు మృతి చెందారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. పాటియాల ఎంపీ ధరమ్వీరా గాంధీ అడిగిన ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ సమాధానమిచ్చారు. ఆయా దేశాల్లోని భారత ఎంబసీల వద్ద ఉన్న లెక్కల ప్రకారం.. భారత కార్మికులు అధికంగా మృతి చెందిన గల్ఫ్ దేశాల్లో సౌదీఅరేబియా ఉంది. ఇక్కడ 2014-18 మధ్య 12,828 మంది కార్మికులు మృతి చెందారు. ఆ తర్వాతి స్థానంలో యూఏఈ(7,877 మంది) ఉన్నది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







