చిలీలో కార్చిచ్చు...8 మంది మృతి
- January 06, 2019
శాంటియాగో : దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తున్నది. మంటల్లో చిక్కుకొని 8 మంది మృతిచెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. వందలాది ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కార్చిచ్చు చెలరేగిన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వోల్పారైసో ప్రాంతంలో భారీ ఆస్తినష్టం సంభవించిందన్నారు. లిమాచే నగర మేయర్ కార్చిచ్చు వ్యాపించిన ప్రాంతాల్లో పర్యటించారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఓ హిగ్గిన్స్ దక్షిణ ప్రాంతంలోని 2600 హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైందని అన్నారు. అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







