చిలీలో కార్చిచ్చు...8 మంది మృతి

- January 06, 2019 , by Maagulf
చిలీలో కార్చిచ్చు...8 మంది మృతి

శాంటియాగో : దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తున్నది. మంటల్లో చిక్కుకొని 8 మంది మృతిచెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. వందలాది ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కార్చిచ్చు చెలరేగిన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వోల్పారైసో ప్రాంతంలో భారీ ఆస్తినష్టం సంభవించిందన్నారు. లిమాచే నగర మేయర్‌ కార్చిచ్చు వ్యాపించిన ప్రాంతాల్లో పర్యటించారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఓ హిగ్గిన్స్‌ దక్షిణ ప్రాంతంలోని 2600 హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైందని అన్నారు. అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com