హైదరాబాద్ లో 13 నుంచి అంతర్జాతీయ పతంగుల పండుగ
- January 08, 2019
ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను ఈనెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ వివరాలను సోమవారం సచివాలయంలో వెల్లడించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19 దేశాలకు చెందిన 42 సంస్థల ప్రతినిధులు, 60 మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కైట్ ఫెస్టివల్తో పాటు ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో 3 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో.. వెయ్యి రకాల వంటకాలు ప్రదర్శిస్తామన్నారు. ఆగాఖాన్ అకాడమీతో సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెంకటేశం తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







